28.7 C
Hyderabad
April 20, 2024 08: 43 AM
Slider నల్గొండ

పెద్ద గట్టు జాతరకు భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం

#Lingamantula Swamy

రాష్టం లో మేడారం తరువాత రెండవ అతిపెద్ద జాతర గా పేరొందిన సూర్యాపేట నియోజకవర్గం లోని దురాజ్ పల్లి పెద్ద గట్టు లింగమంతుల స్వామి జాతరకు ప్రభుత్వం భారీగా నిధులు రిలీజ్ చేసింది. వచ్చే నెల ఫిబ్రవరి 5నుండి నుంచి 9వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరవుతుంటారు.

ఈ క్రమంలో జాతరను వైభవంగా నిర్వహించేందుకు స్థానిక సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ చూపించి జాతర చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా భారీ గా నిధులను విడుదల చేయించారు… ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద గట్టు జాతర లో మౌలిక వసతులు, ఏర్పాట్ల కు గాను రూ 5కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

చరిత్ర లో ఏనాడూ లేని విధంగా ప్రభుత్వ పరంగా పెద్ద గట్టు జాతర కు 5 కోట్ల నిధులు కేటాయించేలా చేసిన మంత్రి జగదీష్ రెడ్డి, సిఎం కేసీఆర్ లు గట్టు ప్రాశస్త్యం ను పెంచారని యాదవ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. యాదవ సమాజం మంత్రి జగదీష్ రెడ్డి కి ఎల్లవేళలా రుణ పడి ఉంటుందనీ అన్నారు..

Related posts

రిక్వెస్టు: నా పుట్టిన రోజు సంబరాలు జరపవద్దు

Satyam NEWS

నా విజయం మహిళ సాధికారిత నూతన శకానికి నాంది

Bhavani

ఆకలితో అలమటిస్తున్న నేతన్నలకు చేయూత

Satyam NEWS

Leave a Comment