పల్నాడు జిల్లా రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అలవాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు వెన్నా బాల కోటి రెడ్డి పై కాల్పులు జరిపిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు పల్నాడు జిల్లా పోలీస్ బాస్ రవిశంకర్ రెడ్డి తెలిపారు.
ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి,హత్యాయత్నానికి ఉపయోగించిన తుపాకీని రొంపిచర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్ పి తెలిపారు. పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
నిందితులపై CR.NO. 18/2023 U/S 307 r/w 34 IPC and Sec.25, Sec. 27 of Arms act, 1959 Of Rompicherla PS కింద కేసు నమోదు చేసి,నరసరావుపేట డిఎస్పీ విజయభాస్కరరావు పర్యవేక్షణలో నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి, రొంపిచర్ల ఎస్సై సురేష్ దర్యాప్తు చేశారు.
ఈ కేసులో
- పమ్మి వేంకటేశ్వర రెడ్డి s/o రామ కోటి రెడ్డి, 46 సంవత్సరాలు, రెడ్డి కులం,ఆలవాల గ్రామం, రొంపిచెర్ల మండలం, పల్నాడు జిల్లా.
- పులి అంజి రెడ్డి s/o వెంకట సుబ్బారెడ్డి, 38 సంవత్సరాలు , రెడ్డి కులం , దొండపాడు గ్రామం నరసరావుపేట మండలం, ప్రస్తుతం 7 వ లైను నల్ల చెరువు గుంటూరు టౌన్
- వంటిపులి వెంకటేశ్వర్లు s/o ఏడుకొండలు, 38 సంవత్సరాలు, వడ్డెర కులం నుదురూపాడు గ్రామం ఫిరంగిపురం మండలం గుంటూర్ జిల్లా.
- పూజల రాములు, s/o నాసరయ్య, 34 సంవత్సరాలు, యాదవ కులం,ఆలవాల గ్రామం, రొంపిచెర్ల మండలం, పల్నాడు జిల్లా. అనే నిందితులను అరెస్ట్ చేశారు.
గత పంచాయతీ ఎలక్షన్లలోను, అలవాలా గ్రామంలో జరుగు ప్రసన్నంజనేయ స్వామి తిరునాళ్ళకు సంబంధించి వివాదం కారణంగా ఈ ఘటన జరిగినట్లు ఎస్ పి తెలిపారు.