కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో గాంధీ చౌక్ వెళ్లే దారి పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో మంగళవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం శుభకార్యానికి వెళ్లిన వారు ఇంటికి తాళం వేసి వెళ్లగా అది గమనించిన కొందరు దుండగులు ఇంటి తాళాలు పగల గట్టి బీరువాలో ఉన్న ఐదు తులాల బంగారాన్ని దొంగిలించినట్లు వారు తెలిపారు.
ఈ విషయంపై సత్యం న్యూస్ ఎస్సై సాయన్న ను వివరణ కోరగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.
కానీ బాధితులు ఎస్సై చెప్పిన నష్టం మాత్రం పొంతన లేకుండా ఉంది. బాధితులు అయిదు తులాలు అంటే ఎస్సై రెండున్నర తులాలు అంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ మండల కేంద్రంలో పెట్రోలింగ్ వ్యవస్థను మరింత ముమ్మరం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.