28.7 C
Hyderabad
April 20, 2024 07: 26 AM
Slider ఆదిలాబాద్

ఎస్ బి ఐ లోకి చొరబడ్డ దొంగలు: లాకర్ నుంచి సొమ్ము చోరీ

#banktheft

ఆసిఫాబాద్ పోలీసు సర్కిల్ పరిధిలోని అడ గ్రామంలోని ఎస్ బి ఐ లో చోరీ జరిగింది. మొన్న రాత్రి ముందస్తు ప్రణాళికతో గుర్తుతెలియని దుండగులు లాకర్ నుండి సుమారు ఎనిమిదిన్నర లక్షల సొమ్మును దొంగిలించారు. అడ గ్రామంలోని ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఎస్ బి ఐ లో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళ చొరబడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ ఆసిఫాబాద్ శ్రీనివాస్, సీఐ ఆసిఫాబాద్ అశోక్ కుమార్, క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ,టాస్క్ ఫోర్స్,డాగ్ స్క్వాడ్ (జాగిలాలు) బృందాలు సంఘటనా స్థలాన్ని చేరుకొని నేర పరిశోధన ప్రారంభించారు. దుండగులు చాకచక్యంగా గ్యాస్ వెల్డింగ్ కట్టర్ల సహాయంతో కిటికీలు తొలగించి, అనంతరం సెక్యూరిటీ కెమెరాలను తీసివేయడం జరిగింది. స్టోరేజ్ బాక్స్ (DVR)ని తీసుకెళ్లారు, అనంతరం లాకర్ ను సైతం ధ్వంసం చేసి సుమారు 8 లక్షల నగదును తీసుకెళ్లారు. అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పి అడ్మిన్ వై.వి.ఎస్ సుధీంద్ర మాట్లాడుతూ  నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అతి త్వరలోనే వారిని పట్టుకుంటామని అన్నారు. ఈ సంఘటన స్థలంలో జిల్లా ఎస్పీ తో పాటు, డిఎస్పి ఆసిఫాబాద్ శ్రీనివాస్, సి ఐ ఆసిఫాబాద్ అశోక్ కుమార్, ఎస్ ఐ లు, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం బృందాలు పరిశీలించాయి.

Related posts

భవన నిర్మాణ కార్మికులు చనిపోయారా? ఎక్కడ?

Satyam NEWS

అమరా ప్రసాద్ దిష్టబొమ్మ దహనం

Bhavani

ఇష్యూడైవర్ట్:దేశంలో రాడికల్ ముస్లింలు పెట్రేగుతున్నారు

Satyam NEWS

Leave a Comment