స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి తనపై చేస్తున్న ఆరోపణలపై 24 గంటల్లో ఆధారాలు బయటపెట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ చేశారు. ఆరోపణలు చేసి పారిపోవడం వైసీపీ నేతలకు అలవాటు గా మారిందని ఆయన అన్నారు.
వైసీపీ నేతల మాదిరి అందరూ అవినీతిపరులు కాదని, ప్రజలను మభ్యపెట్టడానికే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆయన అన్నారు. మీరు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు అయ్యింది.. మీరు చేయని విచారణ లేదు. తనతో పాటు చంద్రబాబుపై చేసిన ఆరోపణల్లోనూ వాస్తవం లేదని తేలిపోయింది. 24 గంటలు సమయం ఇస్తున్నా స్కిల్ డెవలప్మెంట్తో సహా తనపై చేసిన ఆరోపణల్లో ఆధారాలు వైసీపీ బయటపెట్టాలి అని ఆయన అన్నారు.
ఆధారాలు బయటపెడతారో, ప్యాలెస్ పిల్లితో పాటు వైసీపీ పిల్లులు పారిపోతాయో 24 గంటలు వేచి చూద్దాం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.