జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన అనంతరం రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని అనంతపురం జిల్లా తెలుగు దేశం పార్టీ అనుబంధం ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు సాలార్ బాష విమర్శించారు. పల్నాడు జిల్లా నరసరావు పేట లో టిడిపి కార్యకర్త ఇబ్రహీం ను వైసీపీ నాయకులు అతిదారుణంగా హతమార్చడం పై సాలార్ బాష తీవ్రంగా స్పందించారు.
ముస్లింల ప్రార్ధనా మందిరమైన మసీదు స్థలం వ్యవహారంలో అమాయకులపై వైసీపీ కార్యకర్తలు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. టీడీపీ సీనియర్ కార్యకర్త ఇబ్రహీం ను నరికి చంపిన వైసిపి గూండాలను తక్షణమే అరెస్టు చేసి కఠినశిక్ష విధించాలని మృతుని కుటుంబానికి 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలైన రహమాత్ అలీ కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకోవాలన్నారు.