32.7 C
Hyderabad
March 29, 2024 12: 38 PM
Slider అనంతపురం

వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేదు

#Salar Basha,

జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన అనంతరం రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని అనంతపురం జిల్లా తెలుగు దేశం పార్టీ అనుబంధం ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు సాలార్ బాష విమర్శించారు. పల్నాడు జిల్లా నరసరావు పేట లో టిడిపి కార్యకర్త ఇబ్రహీం ను వైసీపీ నాయకులు అతిదారుణంగా హతమార్చడం పై సాలార్ బాష తీవ్రంగా స్పందించారు.

ముస్లింల ప్రార్ధనా మందిరమైన మసీదు స్థలం వ్యవహారంలో అమాయకులపై వైసీపీ కార్యకర్తలు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. టీడీపీ సీనియర్ కార్యకర్త ఇబ్రహీం ను నరికి చంపిన వైసిపి గూండాలను తక్షణమే అరెస్టు చేసి కఠినశిక్ష విధించాలని మృతుని కుటుంబానికి 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలైన రహమాత్ అలీ కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకోవాలన్నారు.

Related posts

కన్ఫ్యూజన్: మార్చి 31 లోపు బడ్జెట్ ఆమోదం పొందుతుందా?

Satyam NEWS

శిక్షణ హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలెట్ల మృతి

Satyam NEWS

మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి

Bhavani

Leave a Comment