విజయనగరం రూరల్ పోలీసుల అదుపులో నిందితుడు
లక్ష రూపాయల వరకు అప్పు చేసాడు..ఆపై జల్సాలు తోడయ్యాయి…చేతిలో డబ్బుల కోసం బ్రహ్మాండమైన ఆలోచన రావడం,దాన్ని అమలు చేయడం… తదనంతరం పోలీసులకు పట్టుబడటం అన్నిసినిమాలోరీల్ లా గిర్రున తిరిగాయి. సీన్ కట్ చేస్తే విజయనగరం రూరల్ పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నారు.ఇందుకు సంబంధించి విజయనగరం సబ్ డివిజన్ పోలీస్ అధికారి అనిల్…మీడియా సమావేశం పెట్టి మరీ…కేసు పూర్వపరాలను తెలియ చేసారు. రూరల్ పరిధి గొల్లల పేటకు చెందిన 28 ఏళ్ల కొయ్యి అప్పలరాజు అదే గ్రామంలో బంగారమ్మ కుటుంబ సభ్యులు లేని సమయంలో బీరువాలో ఉన్న 8తులాల బంగారు ఆభరణాలను అపహరించుకు పోయాడు. ఇంటికొచ్చిన బంగారమ్మ…విషయం తెలుసుకుని వెంటనే రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ మంగవేణి కేసు నమోదు చేసుకుని..ఎస్ఐలు నారాయణ, అశోక్ కుమార్ లకు అప్పగించారు..అంతలోనే విషయం తెలుసుకున్న నిందితుడు…పుస్తెల తాడు మినహా మిగిలిన ఆభరణాలను ఇంటి సమీపంలోని నీటి తొట్టెలో వేసేసాడు. కాగాపుస్తెల తాడు..అమ్మేందుకు నగరానికి బయలుదేరుతుండా విషయం తెలుసుకున్న పోలీసులు…జొన్నవలస జంక్షన్ వద్ద పట్టుకుని విచారిస్తే…దొంగతనం గుట్టు రట్టయింది. అతని వద్ద నుంచీ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం