39.2 C
Hyderabad
March 29, 2024 14: 12 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఇంద్ర‌కీలాద్రిపై గాయ‌త్రీదేవిగా దుర్గ‌మ్మ

pjimage (5)

శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా మూడో రోజైన మంగ‌ళ‌వారం (ఆశ్వ‌యుజ శుద్ధ త‌దియ‌) నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ గాయ‌త్రీదేవిగా సాక్షాత్క‌రించింది. వేద‌మాత‌గా ప్ర‌సిద్ధి పొందిన ఈ త‌ల్లి ముక్తా, విద్రుమ‌, హేమ‌, నీల‌, ధ‌వ‌ళ వ‌ర్ణాల‌తో ప్ర‌కాశిస్తూ భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తున్నది. పంచ ముఖాల‌తో ద‌ర్శ‌న‌మిచ్చే సంధ్యావంద‌న అధిష్టాన దేవ‌త అయిన  గాయ‌త్రీదేవిని పూజిస్తే స‌క‌ల ఉప‌ద్ర‌వాలూ తొల‌గుతాయ‌నీ, బుద్ధి తేజోవంతం అవుతుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ఈ రోజున వంగ‌, ఆకుప‌చ్చ‌, బంగారు వ‌న్నెల చీర‌ల్లో కొలుదీరిన అమ్మ‌వారికి నైవేద్యంగా పులిహోర‌, కేస‌రి, పుల‌గాల‌ను స‌మ‌ర్పిస్తారు

Related posts

మైసమ్మతల్లి దేవాలయ పున:నిర్మాణానికి వైభవంగా భూమి పూజ

Satyam NEWS

డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో అధ్వాన్నంగా ప్రభుత్వ వసతి గృహాలు

Satyam NEWS

Analysis on Vizag Steel: సొమ్ములు పోనాయండి

Satyam NEWS

Leave a Comment