ట్విట్టర్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
తన సైకో పాలన ఎలా ఉండబోతోందో ప్రజలకు చెప్పడానికి అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి చేసిన మొట్టమొదటి పని ప్రజావేదిక కూల్చివేత అని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కోట్ల విలువైన ప్రజల ఆస్తిని ధ్వంసం చేస్తూ… తన ఆలోచనలు ఎలా ఉంటాయో రాష్ట్రానికి సీఎం వివరించి నేటికి మూడేళ్లు అయిందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ చేతగాని జగన్ రెడ్డి చేసినవన్నీ కూల్చివేతలే. ఏపీ అభివృద్ధిని కూల్చాడు. రాష్ట్ర ఆర్థికస్థాయిని కూల్చాడు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కూల్చాడు. దళితుల గూడును, యువత భవితను కూల్చాడు. ప్రజారాజధాని అమరావతిని, పోలవరం కలను కూల్చి రాష్ట్రానికి తీరనిద్రోహం చేశాడు అని చంద్రబాబునాయుడు అన్నారు.
ప్రజావేదిక కూల్చి వికృతానందం పొందిన జగన్….మూడేళ్లలో కట్టింది మాత్రం శూన్యం అని ఆయన అన్నారు. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లోనే పాలన చేస్తూ….తన వల్ల ఏమీ కాదని…తనకు ఏమీ రాదని తేల్చి చెప్పేశాడు. కూల్చడం కంటే నిర్మించడం ఎంత కష్టమైన పనో మూడేళ్ల పాలన తరువాత అయినా జగన్ తెలుసుకోవాలని చంద్రబాబు హితవు చెప్పారు.