అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని యస్ ఆర్.కళ్యాణ మండపం లో బుధవారం రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి గంటా నరహరి గారి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు నేతృత్వంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి” శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
రాయచోటి నియోజకవర్గ ఇంచార్జ్ ఆర్. రమేష్ కుమార్ రెడ్డి గ అధ్యక్షతన రాజంపేట,రైల్వేకోడూరు,రాయచోటి నియోజకవర్గాలకి సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు మరియు యూనిట్ ఇంచార్జిలకు రాబిన్ శర్మ టీం సభ్యులైన పార్లమెంట్ మేనేజర్ శ్రీహరి రెడ్డి, అసెంబ్లీ మేనేజర్ తేజేశ్వర్ రెడ్డి ట్రైనింగ్ కార్యక్రమంకు ఆధ్వర్యం వహించారు.2024 లో టీడీపీ గెలుపే ద్వేయంగా ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్, గాజుల ఖాదర్ బాషా, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు మరియు రాజంపేట,రాయచోటి,రైల్వే కోడూరు నియోజకవర్గాలకు సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇంచార్జీలు, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు