వైసీపీ నాయకులు పోలీసులను నానాబూతులు తిడుతుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని, ఏపి పోలీసులకు ఇదేం ఖర్మ అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఎద్దేవా చేశారు. ఉదాహరణకు 2020 మార్చిలో 12వ తేదీన జరిగిన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు డిఎస్పి పై ప్రవర్తించిన తీరు చెప్పుకోవచ్చునని ఆయన అన్నారు. ఆ రోజున రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు డిఎస్పి ని లం… కొడకా మొ… నాకాను వచ్చావారా డూటికి అంటూ రాయలేని భాషలో తిట్టారని బత్యాల గుర్తు చేశారు.
ఒక డీఎస్పీ ని చెప్పలేని విధంగా రాయలేని విధంగా దుర్భాషలాడిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయిన కొరముట్ల శ్రీనివాసులుకు ఏ సెక్షన్ లో వర్తిస్తాయని ఆయన ప్రశ్నించారు. ఈ సంఘటన జరిగి నేటికీ 2 సంవత్సరాల 8 నెలలు పూర్తయింది ఇప్పటివరకు అతనిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు పోలీసులపై ప్రవర్తిస్తున్న తీరును చూస్తే పోలీసులకు ఏం కర్మ పట్టింది అన్న రీతిలో ఉన్నాయని అన్నారు. రాజంపేట డిఎస్పిని అధికార పార్టీ నాయకుడు దుర్భాషలాడితే అప్పుడు ఎక్కడికి పోయాయి ఈ పోలీస్ సంఘాలు అని ఆయన ప్రశ్నించారు.