* వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం ఖాయం
* సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకునిగా వున్న ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చకు దారితీసాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీ స్థానిక నేతలపై మండిపడిన పొంగులేటి, ప్రస్తుతం ఆ పార్టీ కలవరపడే వ్యాఖ్యలు చేశారు. తనను పలు పార్టీలు రమ్మంటున్నారని , తాను మాత్రం గులాబీ తోటలోనే ఉన్నానని, అవి గుచ్చకుంటున్నప్పటికి భరిస్తూ అందులోనే ఉన్నానని పేర్కొన్నారు.. పార్టీలు మారేంత చెడ్డోడ్ని కాదని, అవకాశం కోసం అలాగే కండ్లు కాసెల ఎదురు చూస్తానని, అయితే వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవకపోతే తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం నిర్ణయం తీసుకోవాల్సిందేనని తెల్చి చెప్పిండు. ఖమ్మం జిల్లా పరిధిలో గత కొన్ని రోజులుగా ఆయన పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలు చోట్ల ఈ వ్యాఖ్యలు చేశారు .
తాను జనంతోనే ఉన్నానని, వారి కోసం ఏదైనా చేస్తానని తనను నమ్మిన వాళ్ళకు అన్యాయం జరిగితే సహించనని హెచ్చరించారు. తాను ప్రస్తుతం గులాబీ పార్టీలోనే ఉన్నానని, ముళ్లు గుచ్చుకుంటున్నాయని, అయినప్పటికి గులాబీ వనంలోనే ఉంటానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తన అభిమానులు కూడా గులాబీ తోటలోనే ఉంటారని, తమకు మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. అలాగే వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయడం ఖాయమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నో అవమానాలు ఎదురైయినప్పటికి ఒక్క మాట కూడా మాట్లడలేదని, తనను నమ్ముకున్నోళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారని , తన వారి కోసం భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే తప్పదని చెప్పారు.