మూడు రాజధానులు ముద్దు అన్ని ప్రాంతాల అభివృద్ధి అనే అంశం పై గుంటూరు జిల్లా నరసరాపుపేట శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తూఉన్నారని తెలిపారు.
చంద్రబాబు హయం లో అమరావతి లో తన భూముల ధరలు పెంపు కోసం మాత్రమే ప్రయత్నాలు చేశారని, అందుకోసం గ్రాఫిక్ రాజధాని ని సృష్టించారని ఆయన విమర్శించారు. ఈ సమావేశం లో పట్టణ కన్వీనర్ హనీఫ్, పిల్లి ఓబుల్ రెడ్డి, సుజాత పాల్ తదితరులు పాల్గొన్నారు.