విజయనగరం జిల్లాలో ఒకే రోజు ముగ్గురు సీఐలు తమతమ పోలీసు స్టేషన్ లలో ఇన్ స్పెక్టర్లు గా చార్జ్ తీసుకున్నారు. విజయనగరం వన్ టౌన్ సీఐ గా బి.వెంకటరావు బాధ్యతలు చేపట్టిన తరువాత జిల్లా ఎస్పీ ఎస్పీ ని జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేసారు.
ఈ సందర్భంగా సిఐ గారికి జిల్లా ఎస్పీ ని కలిసారు. ఈ సందర్భంగా ఎస్పీ…, సమర్థవంతంగా పని చేయాలని, శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఇక బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎస్.తిరుమల రావు గారు బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక ను డీపీఓలో మర్యాద పూర్వకంగా కలిసి, పుష్ప గుచ్చం అందజేసారు. ఈ సందర్భంగా సీఐ జిల్లా ఎస్పీని కలిసారు.
సమర్థవంతంగా పని చేయాలని, శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా విధులు నిర్వహించాలని అదేశించారు.అలాగే గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎల్.అప్పల నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తరువాత జిల్లా ఎస్పీ ఎం.దీపిక జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, పుష్ప గుచ్చం అందజేసారు. ఈ సందర్భంగా సిఐ కి జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి, సమర్థవంతంగా పని చేయాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చెయ్యాలని, శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు.