జగిత్యాల జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో కిరాణా షాప్ నిర్వహిస్తున్న ఒకే కుటుంబంకు చెందిన ముగ్గురు కరోనాతో మృతి చెందారు.
కొన్ని రోజుల క్రితం గణేష్ నగర్ కి చెందిన కిరాణా వ్యాపారి దొంతుల రాంచంద్రం తో పాటు ఆయన ఇద్దరు కొడుకులు సునీల్, సుమన్ లకు కరోనా సోకింది.
మొదట తండ్రి రాంచంద్రం మరణించగా కొద్దీ రోజుల వ్యవధిలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెద్ద కుమారుడు సునీల్ మృతి చెందారు.
నేడు చిన్న కుమారుడు సుమన్ కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
7 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనా రక్కసికి బలయ్యారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.