40.2 C
Hyderabad
April 19, 2024 17: 14 PM
Slider కరీంనగర్

కరోనాతో కిరాణా షాప్ నిర్వహించే కుటుంబంలో ముగ్గురి మృతి

#JagityalaDist

జగిత్యాల జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో కిరాణా షాప్ నిర్వహిస్తున్న ఒకే కుటుంబంకు చెందిన ముగ్గురు కరోనాతో మృతి చెందారు.

కొన్ని రోజుల  క్రితం గణేష్ నగర్ కి చెందిన కిరాణా వ్యాపారి దొంతుల రాంచంద్రం తో పాటు ఆయన ఇద్దరు కొడుకులు సునీల్, సుమన్ లకు కరోనా సోకింది.

మొదట తండ్రి రాంచంద్రం మరణించగా కొద్దీ రోజుల వ్యవధిలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెద్ద కుమారుడు సునీల్ మృతి చెందారు.

నేడు చిన్న కుమారుడు సుమన్ కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

7 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనా రక్కసికి బలయ్యారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Related posts

ఫాలో మీ: చికెన్ తిన్న మునిసిపల్ మంత్రి కేటీఆర్

Satyam NEWS

బ్రూటల్ కిల్లింగ్: ఆస్తి కోసం తల్లిని చెల్లిని చంపేపిన ఘనుడు

Satyam NEWS

టీడీపీ అంటే చంద్రబాబు దోచుకున్న పార్టీ

Satyam NEWS

Leave a Comment