శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం బీచ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. స్నేహితులతో కలిసి సముద్రంలో ఈతకు వెళ్లిన వారిలో ముగ్గురు యువకులు మరణించారు.
ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్, ఏటిరాంపూర్ కి చెందిన కొంత మంది పొట్ట కూటి కోసమై సీలింగ్ పనులు చేసేందుకు శ్రీకాకుళం జిల్లాకి వచ్చారు.
వీళ్ళలో 8 మంది సరదాగా సముద్ర స్నానానికి కళింగపట్నం బీచ్ కి వెళ్లారు. అందులో ముగ్గురు గల్లంతు అయ్యారు. వారిని సందీప్, అజిజ్, చోటు అనే వారిగా గుర్తించారు.
గల్లంతు అయిన వాళ్ళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. CI అంబేద్కర్, SI దగ్గర ఉండి గజ ఈతగాళ్లు తో గాలింపు చర్యలు చేపట్టారు.