ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పులిగుండాల జలాశయం ముగ్గురి ప్రాణాలు బలిగొన్నది. 8 మంది స్నేహితులు నేడు పులిగుండాల ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు.
వాళ్లల్లో 5 మంది ఈతకని జలాశయంలోకి దిగారు. అయితే అనుకోని ప్రమాదం జరగనే జరిగింది. ఐదుగురూ కొట్టుకుపోయారు. కొట్టుకుపోతున్న వారిలో ఇద్దరిని స్థానికులు కాపాడారు.
అయితే ముగ్గురిని మాత్రం రక్షించలేకపోయారు. జంగా గుణ(24), శీలం చలపతి(25), వేమిరెడ్డి సాయి(25) లు నీటిలో గల్లంతయ్యారు.
ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. జలాశయంలో గల్లంతైన ముగ్గురి యువకుల కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు.
ఆ గల్లంతైన ముగ్గురు యువకుల సొంతూరు కల్లూరు మండలం బత్తలపల్లి గ్రామంగా పోలీసులు గుర్తించారు.