32.7 C
Hyderabad
March 29, 2024 10: 27 AM
Slider ఖమ్మం

ఈత సరదా తో వెళితే ముగ్గురి ప్రాణాలు తీసిన పులిగుండాల

drown

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పులిగుండాల జలాశయం ముగ్గురి ప్రాణాలు బలిగొన్నది. 8 మంది స్నేహితులు నేడు పులిగుండాల ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు.

వాళ్లల్లో 5 మంది ఈతకని జలాశయంలోకి దిగారు. అయితే అనుకోని ప్రమాదం జరగనే జరిగింది. ఐదుగురూ కొట్టుకుపోయారు. కొట్టుకుపోతున్న వారిలో ఇద్దరిని స్థానికులు కాపాడారు.  

అయితే ముగ్గురిని మాత్రం రక్షించలేకపోయారు. జంగా గుణ(24), శీలం చలపతి(25), వేమిరెడ్డి సాయి(25) లు నీటిలో గల్లంతయ్యారు.

ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. జలాశయంలో గల్లంతైన ముగ్గురి యువకుల కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు.

ఆ గల్లంతైన ముగ్గురు యువకుల సొంతూరు కల్లూరు మండలం బత్తలపల్లి గ్రామంగా పోలీసులు గుర్తించారు.

Related posts

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS

స్వచ్ఛ సర్వేక్షణ్‌ లో ఖమ్మం ఫస్ట్

Murali Krishna

ఆరోగ్య సిబ్బందిని వేధిస్తున్నపిహెచ్ సి డాక్టర్

Satyam NEWS

Leave a Comment