దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన దారుణ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస నగర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు రోడ్డు డివైడర్ ను ఢీ కొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు తగిలాయి. వీరంతా గుంటూరు వాసులుగా సమాచారం.