మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల గ్రామంలో పెను విషాదం చోటు చేసుకున్నది. ఎడతెరిపిలేకుండా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి మిద్దె కూలి ముగ్గురు మరణించారు.
వర్షానికి పాత మట్టి మిద్దె బాగా నానిపోయింది. దాన్ని కుటుంబ సభ్యులు గమనించలేదు. దాంతో అది కూలిపోయింది. మట్టి మిద్దె కూలిపోవడంతో అందులో నివసిస్తున్న శరణమ్మ తో పాటు ఆమె కుమార్తెలు వైశాలి, భవాని మృతి చెందారు.