తిరుపతి సమీపంలోని ఏర్పేడు మండలంలో దారుణం జరిగింది. ఒక మైనర్ బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచార ప్రయత్నం చేశారు. ఆ బాలిక ప్రతిఘటించి కేకలు వేయడంతో చుట్టుపక్కల పశువుల కాపరులు వచ్చారు. దాంతో ఆ ముగ్గురు యువకులు పరారీ అయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.
వారిని పల్లం హరిజనవాడకు చెందిన సాయి కృష్ణ (25), అంకయ్య (21) వీరస్వామి (22)గా గుర్తించారు. గాలింపు చర్యలు ఫలించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని ఏర్పేడు పోలీస్-స్టేషన్ లో రేణిగుంట పోలీసులు విచారిస్తున్నారు.