26.2 C
Hyderabad
February 13, 2025 21: 52 PM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

కరెంటు షాక్ తో ముగ్గురు రైతుల మృతి

Farmers death

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వేల్పుగొండ గ్రామ శివారు లో కరెంట్ షాక్ తగిలి ముగ్గురు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు.  సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్రామ శివారు లోని వ్యవసాయ బోరు బావి నుండి పంపు మోటార్ తీస్తుండగా పైపులకు కరెంట్ తీగలు తగలడంతో ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో గ్రామానికి చెందిన ఐలేని లక్ష్మారావు (60), ఐలేని మురళీధరరావు (55), ఇమ్మడి నారాయణ (42) లు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి మాచారెడ్డి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఇంటర్ టాపర్ ను అభినందించిన డాక్టర్ కొత్తపల్లి

Satyam NEWS

తునిలో మంత్రి ధర్మాన మునిసిపల్ ఎన్నికల ప్రచారం

Satyam NEWS

పారిశుధ్య కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు

Satyam NEWS

Leave a Comment