నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఆదివారం సాయంత్రం అదృశ్యమైన ముగ్గురు బాలికలు సింగన్గావ్ చెరువులో సోమవారం తెల్లవారుజామున బాలికల మృతదేహాలు లభ్యమయ్యాయి.
సెల్ఫిఅనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ సెల్ఫీ పిచ్చిలో పడి యువత తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ స్టేటస్ లో గాని వైరేటి రీతిలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు చివరికి వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లింది.
వింత వింత ఫోటోల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా సెల్ఫి పిచ్చి ముగ్గురి బాలికల తమ నిండు ప్రాణాలను బలి తీసుకుంది
ఈ విషాదకర ఘటన తానూరు మండలం సింగన్గావ్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మృతులు సునీత(16),వైశాలి(14),అంజలి (14), ఆదివారం ఆన్లైన్ క్లాస్ లేకపోవడంతో మార్నింగ్ వల్ల గ్రామ శివార్లో గల వ్యవసాయానికి వెళ్ళారు,తిరుగు ప్రయాణంలో చెరువు దగ్గరి కి వెళ్లి సెల్ఫీ దిగుతుండగా కాలు జారి చెరువులో పడిపోయారు.
ఆ ముగ్గురు బాలికలు తిరుగు ముఖం ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామ సమీపంలో చెరువు సమిపంలోని బాలికల చెప్పులు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి ముదోల్ సి ఐ అజయ్ బాబు తానూర్ ఎస్ ఐ రాజన్న సంఘటన స్థలానికి చేరుకొని ఈ చెరువులో ఈతగాళ్ల సాయంతో ఆ ముగ్గురు బాలికల శవాలను వెలికి బయటకు తీశారు.
మృతురాలు కుటుంబీకుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. బాలికల మృతితో కుటుంబీకులు రోదనలు కంటితడి పెట్టించాయి. ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.