శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. రామారావు అనే ఒక యువకుడు వరుసకు వదిన అయ్యే ఎర్రమ్మ (40)తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొద్ది కాలం పాటు ఇద్దరి మధ్య అక్రమ సంబంధం సక్రమంగానే సాగింది. అయితే గత కొంత కాలంగా ఎర్రమ్మ సంతోష్ (25) అనే మరో యువకుడితో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నది. ఈ విషయం చివరకు రామారావుకు తెలిసింది. దీనిని రామారావు తట్టుకోలేకపోయాడు. పొలంలో పని చేసుకుంటున్న ఎర్రమ్మ, సంతోష్ ను దారుణంగా చంపేశాడు. ఆపై గొంతు కోసుకుని రామారావు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్డపనసలో ఈ దారుణం జరిగింది.