34.2 C
Hyderabad
April 19, 2024 19: 57 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లా మధునాపురం వాగులో ముగ్గురు గల్లంతు

#saralasagar

వనపర్తి జిల్లా మధునాపురం వాగులో ముగ్గురు గల్లంతు అయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సరళాసాగర్ ఆటోమేటిక్ సైఫాన్స్ తెరుచుకున్నాయి. దాంతో మధనాపురం ఆత్మకూరు మధ్యన రోడ్డుపై నీటి ప్రవాహం భారీగా ఒక్క సారిగా పెరిగింది. నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో  కొత్త కోటకు చెందిన ముగ్గురు ద్విచక్ర వాహనంపై వెళుతూ కొట్టుకు పోయారు. వీరు ముగ్గురూ దసరా పండుగ నిమిత్తం కౌకుంట్ల గ్రామం నుండి కొత్తకోట వచ్చి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. కొత్తకోట కు చెందిన సాయికుమార్ (24) తో పాటు కౌకుంట్ల మండల కేంద్రానికి పరిమిళ( 16)చెన్నమ్మ (35)లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వారిలో ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

మదర్ సేవ సమితి యూత్ ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం

Satyam NEWS

హిందూపూర్ 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

Bhavani

సెప్టెంబర్ 22,23 తేదీలలో ఎస్ఐ శారీరిక ధారుడ్య పరీక్షలు…!

Satyam NEWS

Leave a Comment