పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మఠములో బెంగుళూరుకు చెందిన కుమారి సుదీక్ష బృందం వారిచే సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. బెంగళూరుకు చెందిన కుమారి రచన బృందం వారిచే దాస వాణి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఆనందోత్సాహాలతో తిలకించారు. దాస వాణి, సంగీత విభావరి కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.