సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టిక్కెట్లు ఖాయం
స్వార్ధ రాజకీయాల కోసం జగన్ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నాడని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ రాజధాని అంశంపై ఆయన నేడు టీడీఎల్పీలో సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. శాసనసభలో మంత్రులకు ధీటుగా ఎలా సమాధానం చెప్పాలో ఎమ్మెల్యేలకు వివరించారు. అమరావతే రాష్ట్ర రాజధాని అని, అందుకు పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉందన్నారు.
స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టుగా అమరావతికి ప్రణాళిక చేశాం. ఖర్చు లేకుండానే 33 వేల ఎకరాల భూ సమీకరణ చేసి మౌలిక సదుపాయాలు సమకూర్చాo అని చంద్రబాబునాయుడు తెలిపారు. అమరావతి నిర్మాణం పూర్తయితే సంపద సృష్టికి కేంద్రమవుతుందని ఆయన అన్నారు. జగన్ లాంటి వారు అందరూ ఆమోదించిన తర్వాతనే అమరావతిని రాజధానిగా ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడేమో స్వార్ధ రాజకీయాల కోసం జగన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. అమరావతిపై మాట తప్పి, మడమ తిప్పింది జగన్మోహన్ రెడ్డే అని చంద్రబాబు పేర్కొన్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి పార్టీ టికెట్లు
టీడీఎల్పీలో సమావేశంలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టికెట్లు ఇస్తామని ప్రకటించారు. ముందస్తు ఎన్నికల అంచనాల నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.