నరసరావుపేట పట్టణ శివారు ప్రాంతాల్లో ఏపీ టీడ్కో ఆధ్వర్యంలో ఇళ్ళు లేని నిరుపేదల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 1504 గృహాలను ఎంపిక చేసిన లబ్ధిదారులకు అప్పగించాలచి చదలవాడ అరవింద్ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇళ్ల స్వాధీనం కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం రాత్రి నుంచి పలువురికి నోటీసులు జారీ చేయడం, పార్టీల నేతలను ముందస్తుగా గృహ నిర్బంధం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. 18 నెలల నుండి ఇళ్ళు పేదలకు ఎందుకు ఇవ్వలేకపోయారో వై.సి.పీ నాయకులు ప్రజలకు సమాధానం ఏం చెబుతారో? చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇళ్ల స్వాధీనం కార్యక్రమాన్నిభగ్నం చేసిన రాబోయే రోజుల్లో లబ్ధిదారుల కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని, లబ్ధిదారులకు ఇళ్లు అందించే వరకూ మా ఉద్యమం ఆగబోదని, అక్రమ అరెస్టులు ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం అని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరుచుకొని టీడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.