తమ వద్ద ఉన్న డేటా సురక్షితమని చైనా ప్రభుత్వంతో సహా ఎవరికి షేర్ చేయలేదని టిక్ టాక్ భారత్ హెడ్ నిఖిల్ గాంధీ ఒక ప్రకటనలో తెలిపారు. కోట్లాది మంది భారతీయులు తమ యాప్ ను వాడుతున్నారని తొలి సారిగా ఇంటర్ నెట్ వాడుతున్న వారే ఎక్కువగా ఉన్నారని ఆయన తెలిపారు.
14 భారతీయ భాషల్లో ఉన్న టిక్ టాక్ యాప్ లో డేటా సురక్షితమని ఆయన అన్నారు. భారత్ లో తమ యాప్ ను బ్యాన్ చేయడంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని ఆయన వెల్లడించారు. టిక్ టాక్ యాప్ భారత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి మాత్రమే పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.