ఫిబ్రవరి 19వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకుని రథసప్తమి పర్వదినాన తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వాహన సేవల వివరాలు ఇవి
ఉ. 7.30 – ఉ. 8.30 సూర్యప్రభ వాహనం
ఉ. 9.00 – ఉ. 10.00 హంస వాహనం
ఉ. 10.30 – ఉ. 11.30 అశ్వ వాహనం
మ. 12.00 – మ. 1.00 గరుడ వాహనం
మ. 1.30 – మ. 2.30 చిన్నశేష వాహనం
సా. 6.00 – రా. 7.00 చంద్రప్రభ వాహనం
రా. 8.30 – రా. 9.30 గజ వాహనం
కాగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, లక్ష్మీపూజ, ఊంజలసేవ, బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.