కామారెడ్డి జిల్లా బిచ్కుంద లోని తిరుమల ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. బిచ్కుంద మండల కేంద్రంలో సకల హంగు ఆర్భాటాలతో ప్రారంభించిన తిరుమల ఆస్పత్రిని రెవెన్యూ, పోలీస్ అధికారులు కలిసి సీజ్ చేశారు.
వారం రోజుల క్రితం పిట్ల౦ మండల కేంద్రంలో ఇదే పేరుతో ఉన్న ఈ ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తున్నారని మండలానికి చెందిన ఓ వ్యక్తి జిల్లా వైద్య శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు.
సమస్యపై విచారణ చేపట్టగా బిచ్కుంద ఆస్పత్రికి కూడా సరైన అనుమతులు లేవనే విషయం తేలింది. దాంతో ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు.
ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆస్పత్రికి సీజు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రెవెన్యూ, పోలీస్ అధికారులు సిబ్బంది ఉన్నారు.