సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండలం లోని అగ్రరం(ఖుతుబ్షాపురం)లో జరుగుతున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కల్యాణ మహోత్సవానికి శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ శ్రీలక్ష్మీ తిరుపతమ్మ కల్యాణానికి సాదరంగా ఆహ్వానించిన గ్రామ ప్రజలకు,నాయకులకు,అక్క చెల్లెళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కల్యాణ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. త్వరలో కుతుబ్షాపురం బ్రిడ్జిని పూర్తి చేస్తామని,మిగిలిపోయిన సి సి రోడ్లు ఉంటే పూర్తి చేసి మట్టి రోడ్ కనిపించకుండా చేద్దామని,రంగపురం రోడ్ పూర్తి చేశామని,కొనాయిగూడెం రోడ్డు త్వరలోనే పనులు మొదలౌతాయని,బక్కయ్యగూడెం రోడ్ కూడా పూర్తి అయిందని అన్నారు.
ఎల్ 27,29 లిఫ్ట్ లను కూడా రిపేర్ చేయిస్తామని,నియోజక వర్గానికి 3000 కోట్ల రూపాయల పై చిలుకు నిధులు ఖర్చుపెట్టి పలు అభివృద్ధి పనులు చేయించామని,ఇంకా ఎన్ని నిధులు అయిన సరే తెచ్చి నియోజక వర్గాన్ని, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని అన్నారు.
ఈ కార్యక్రమంలో హుజుర్ నగర్ మార్కెట్ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ నాయక్, మండల పరిశీలకుడు పిడమర్తి రాజు, వెలిదండ ప్రధాన కార్యదర్శి పార్థసారథి, కుతుబ్షాపురం సర్పంచ్ నల్లబాటి విరమ్మ భాస్కర్, ఎంపిటిసి బిక్షం,గ్రామ శాఖ అధ్యక్షుడు కారింగుల సతీష్, ఉపాధ్యక్షుడు పాలెల్లి పురుషోత్తం, కార్యదర్శి సలిగంటి వాసు,యూత్ అధ్యక్షుడు షేక్.నాగుల మీరా,ఎస్సి సెల్ కదురు వెంకటి,పెద్దపోలు వెంకన్న,వివిధ గ్రామ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్,హుజూర్ నగర్