31.7 C
Hyderabad
April 24, 2024 23: 52 PM
Slider నెల్లూరు

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు వినూత్న ప్రచారం

#anamramanarayanareddy

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం లో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నారు.

మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి గ్రామ శక్తిస్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి దివ్య ఆశీస్సులు తీసుకున్న అనంతరం, అమ్మవారికి మొదటి ప్రచార కరపత్రాన్ని అందజేసి… ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారం ఏప్రిల్ 1 నుండి 15 వరకు 5 విడతలుగా 5 రకాల ప్రచార కరపత్రాలతో వినూత్నంగా ఇంటింటా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ప్రచార కార్యక్రమంలో తనతో పాటు వెంకటగిరి రాజా, వెంకటగిరి మున్సిపాలిటీ ఎన్నికల పరిశీలకులు, కమలాపురం ఎమ్మెల్యే  రవీంద్రనాథ్ రెడ్డి తో పాటు తో పాటు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, పార్టీ విప్, కౌన్సిలర్లు పాల్గొంటారని ఎమ్మెల్యే ఆనం మీడియాకు తెలిపారు.

తిరుపతి పార్లమెంటు  వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ మద్దిల గురుమూర్తి కి వెంకటగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ సాధించి, తిరుపతి పార్లమెంటు సీటును ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కి కానుకగా అందజేస్తామని ఆయన తెలిపారు.

కె.రమాకాంత్, వెంకటగిరి సామాన్యుడు

Related posts

బిజెపి పోలింగ్ బూత్ కమిటీల ఎంపిక

Satyam NEWS

రెండు గంటల పాటు whats app కు గ్రహణం!

Satyam NEWS

ప్రభుత్వ పాఠశాలలో ప్లాస్టిక్ బియ్యం పంపిణి..?

Satyam NEWS

Leave a Comment