27.7 C
Hyderabad
April 20, 2024 02: 33 AM
Slider చిత్తూరు

తిరుపతి మిస్టరీ హత్యకేసులో ముద్దాయి అరెస్ట్….

#tirupati police

అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరుతో సంస్థ నడిపే వ్యక్తి భార్యను హత్య చేసిన సంఘటన ఇటీవల సంచలనం సృష్టించింది. తిరుపతి డి బి ఆర్ ఆసుపత్రి రోడ్డులోని శ్రీ పద్మావతి శ్రీనివాస నిలయం అపార్ట్మెంట్ 101 లో జాన్ 22 తెల్లవారి జామున హత్య జరిగింది.

ఈ హత్య కేసును ఛేదించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడ్ని అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం నిద్రపోతున్న భువనేశ్వరి ని మొఖం పై దిండు తో అదిమి ఊపిరి ఆడకుండాచేసి భర్త హత్య చేసాడని తేలింది.

పీపుల్స్ అగైనిస్ట్ కరప్షన్ ఆర్గనైజేషన్ నడుతున్నానంటూ 2016లో ఫేస్ బుక్ ద్వారా భువనేశ్వరితో పరిచయం చేసుకొని, 2018లో పెద్దలు అంగీకరించక పోవడంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. హత్యకు ముందు భార్య భర్తలు మధ్య గొడవలు వుండేవి.

రిలయన్స్ మార్ట్ లో సూట్ కేసు కొని అందులో భువనేశ్వరి మృతదేహాన్ని ప్యాక్ చేశాడు. తన భార్య కరోనాతో రుయా ఆసుపత్రిలో ఉందని వెంటిలేటర్ తీసుకెళ్లాడని క్యాబ్ కావాలని నమ్మించి క్యాబ్ డ్రైవర్ తో రుయా ఆసుపత్రికి వెళ్ళాడు.

రుయా ఆవరణలోని మెడిసిన్ గోడౌన్ వెనుక సూట్ కేస్ తో సహా పెట్రోల్ పోసి పట్టపగలే కాల్చివేసాడు. కూతురు కరుణశ్రీ ని తీసుకుని భార్య బంధువులకు అప్పగించి కరోనాతో భువనేశ్వరి మృతి చెందిందని నమ్మించాడు.

హత్యకు ఉపయోగించిన దిండును మృతురాలు పై ఉన్న నగలను స్వాధీన పరచుకొని,302,304బి,201 ఐపీసీ సెక్షల క్రింద కేసు నమోదు రిమాండ్ కు పంపుతున్నట్టు తిరుపతి అర్బన్ ఎస్పి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ సుప్రజ మీడియాకుతెలిపారు.

Related posts

మోసం చేసిన ప్రియుడి కోసం వాటర్ ట్యాంక్ ఎక్కింది

Satyam NEWS

(2022) Where To Buy Extenze Best T Booster For Muscle Gain

Bhavani

చీరాల టిడిపి టిక్కెట్ నాదే: కొండయ్య స్పష్టీకరణ

Satyam NEWS

Leave a Comment