సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గః తెలంగాణ జనసమితి ఇంచార్జీగా దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి ని నియమిస్తూ శుక్రవారం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.కోదండరాం నియామక ఉత్తర్వులు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో నాయకులను,కార్యకర్తలను కలుపుకుని గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు పార్టీ పటిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్