తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీలో తమ పార్టీ టీజేఎస్ ను విలీనం చేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
గతంలోనే ఈ మేరకు కోదండరామ్ తో రేవంత్ చర్చలు జరిపారు.
అయితే పిసిసి అధ్యక్షుడు ఎవరు అవుతారో తెలియని నేపథ్యంలో పార్టీ విలీనంపై నిర్ణయం తీసుకోలేమని అప్పటిలో కోదండరామ్ తెలిపారు.
రేవంత్ అధ్యక్షుడు అయితేనే విలీనం లేదా పొత్తు పై ఆలోచన చేద్దామని గతంలో తన పార్టీ సహచరులతో కోదండరాం చెప్పారు.
అధిష్టానంతో చర్చించి రేవంత్ నిర్ణయం తీసుకున్న తర్వాత తదుపరి చర్చలు ఉండే అవకాశం కనిపిస్తున్నది.