హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే అంటూ వాట్స్ యాప్ మెసేజీలు పెట్టుకోవడం కాదు. వాస్తవ రూపంలో దాన్ని చూపించాలి. ములుగు జిల్లా గోవిందరావుపేట కు చెందిన స్నేహితులు అదే చేసి అందరికి ఆదర్శంగా నిలిస్తున్నారు.
ఇటీవల కరోనాతో మృతిచెందిన తోటి స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి నిజమైన స్నేహాన్ని చాటుకున్నారు అతని తోటి స్నేహితులు. మండలంలోని పసర గ్రామానికి చెందిన బూదాటి సందీప్ 34 ఇటీవల కరోనాతో మృతి చెందారు.
2006 సంవత్సరంలో సందీప్ తో పాటు పదవ తరగతి చదువుకున్న గ్రామ విద్యార్థులంతా పేద కుటుంబానికి చెందిన సందీప్ ను ఆదుకోవాలని తలా కాస్త ఆర్థిక సహాయం అందించారు. మంగళవారం ఈ మొత్తం 42000 రూపాయలను సందీప్ భార్య శారద ద్వారా అతని కుమార్తె అశ్విని పేరున డిపాజిట్ చేశారు.
స్నేహితుని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు గ్రామస్తులంతా సందీప్ స్నేహబంధాన్ని అభినందించారు. అదేవిధంగా సందీప్ కుటుంబ సభ్యులు కూడా సందీప్ స్నేహితులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు సూరారపు రాజు అజీజ్ పోరండ్ల వేణు బోళ్ళ అశోక్ తదితరులు పాల్గొన్నారు.