తనను యోగా, ఆయుర్వేదం కాపాడతాయని, తనకు వ్యాక్సిన్ అవసరం లేదని ఇంత కాలం చెప్పిన బాబా రామ్ దేవ్ ఇప్పుడు మాట మార్చాడు.
కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వచ్చాడు. ఈ దేశానికి అల్లోపతి వైద్యులు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారని కితాబిచ్చాడు.
ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని అందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తానని చేసిన ప్రకటనను రామ్ దేవ్ బాబా స్వాగతించాడు.
దేశంలో ఇది ఎంతో కీలకమైనదని, అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని రామ్ దేవ్ బాబా పిలుపునిచ్చాడు.
రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందాలని ఆయన అన్నాడు.
యోగా, ఆయుర్వేదంతో అదనపు రక్షణ లభిస్తుందని ఆయన చెప్పాడు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో తనకు ఎలాంటి ద్వేషభావనలు లేవని రామ్ దేవ్ స్పష్టం చేశాడు.