40.2 C
Hyderabad
April 24, 2024 15: 33 PM
Slider కర్నూలు

బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు స్పర్శ దర్శనం టిక్కెట్లు

#Srisailam

శ్రీశైలం వెళ్లే యాత్రి కులు బస్సు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే స్పర్శ దర్శన టికెట్లనూ అందుబాటులోకి తీసుకురాను న్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమల రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంతో పాటు, పొరుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలకూ ప్రత్యేక సర్వీసులు నడి పేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.

‘బస్సుల్లో తిరుపతి వెళ్లే భక్తులకు శ్రీవారి శీఘ్రద ర్శన టికెట్లు అందుబాటులో ఉంచినట్లే.. శ్రీశైలం విషయంలోనూ ఈ విధానాన్ని తెస్తున్నాం. పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి కోసం ఇకపై వివిధ ప్యాకేజీలు తీసుకొస్తాం. భక్తులకు రాత్రి వేళల్లో వసతి కల్పించడంతో పాటు.. టూరిస్ట్ గైడ్లనూ అందుబాటులో ఉంచుతాం’ అని వివరించారు.

ఫేస్ బుక్ లో అభ్యర్థనకు ఆర్టీసీ స్పందన

కృష్ణా జిల్లా పామర్రు నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్లకు వెళ్లడానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని వెంకట్రావు అనే వ్యక్తి ఇటీవల ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డిని ఫేస్బుక్ ద్వారా కోరారు. స్పందించిన ఆయన రాత్రి 8 గంటలకు 40 మంది ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూశారు.

Related posts

కొత్తకోట దయాకర్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న చంద్రబాబు

Satyam NEWS

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

Bhavani

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం

Satyam NEWS

Leave a Comment