హైదరాబాద్ లోని 124 ఆల్విన్ కాలనీ డివిజన్ లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సుడిగాలి పర్యాటన చేశారు. అల్విన్ కాలనీ డివిజన్ లోని ముంపు ప్రాంతాలైన ధరణి నగర్, రాం ఖీ పెరల్, ఇందిరా హిల్స్ ,సాయి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ముంపు ప్రాంతాల్లో పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించి బాధితులను అవస్తల నుంచి దూరం చేయాలని అధికారులు తెలిపారు.
డివిజన్ లో ఎక్కడ సమస్య తలెత్తినా తన దృష్టికి తీసుకు రావాలని ఆయా కాలనీ వాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్,, బీసీ సంఘం అధ్యక్షుడు రాజేష్ చంద్ర, , చిన్నోళ్ళ శ్రీను, సీనియర్ నాయకులు బోయ కిషన్ నరసింహాచారి , ఏరియా కమిటీ సభ్యులు వెంకటేష్, మున్నాబాయ్, రాములు గౌడ్, ఎస్ ఆర్ పీ సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.