తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పేరంటాలపల్లి- పోనిమ్మగండి లాంచీల రేవు నుండి పైలెట్ బోటు వెనుక లాంచీలు జల విహార యాత్రకు బయలుదేరి వెళ్ళాయి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక ఆపరేషన్ నిబంధనలు పై విశ్వసనీయతను పెంపొందించే దిశగా డ్రై రన్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ తెలిపారు. ఈ పైలెట్ విధానం అన్ని విధాల విజయవంతం చేసి పర్యాటకుల భద్రతకు భరోసా కల్పించాలని ఆయన పర్యాటక అధికారులను ఆదేశించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ మాట్లాడుతూ బోటుల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ ఉండాలని పరిమితికి మించి బోటుల్లో ఎక్కించు కూడదని బోట్లో వెళ్లేటప్పుడు లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆదేశించారు. ఈ నిబంధనలు ఏ బోటు వానర్ లైనా పాటించకపోతే వాళ్ళ పై చట్టపరమైన చర్యలు తీసుకుని బోటు లైసెన్స్లు రద్దు చేస్తామని తెలియజేశారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు టి ఈ ఎం రాజు, డివిజనల్ మేనేజర్ వీరనారాయణ, దేవీపట్నం ఎస్సై కె. వి. నాగార్జున, తహశీల్దార్ ఎం.వీర్రాజు. డి టి బాపిరాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.