తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఎస్.కె.బషీర్ ను నియమిస్తూ TPCC అధ్యక్షుడు నల్లగొండ పార్లమెంటు సభ్యుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వుల కాపీని బుధవారం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని M.P క్యాంపు కార్యాలయంలో S.K. బషీర్ కు టి.పి.సి.సి జాయింట్ సెక్రటరీ ఎండీ.అజీజ్ పాషా, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ నిజాముద్దీన్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్, డిసిసిబి డైరక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు,ఎస్ కె. సైదా మేస్త్రీ, బంకు బ్రహ్మం,గంజి చంద్రమౌళి తదితరులు బషీర్ ను సన్మానించి ఉత్తర్వు కాపీని ఆయనకు అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మరింత కృషి చేయాలని కోరారు. అనంతరం బషీర్ మాట్లాడుతూ శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలను కలుపుకుని కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.