సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు ఆదివారం TPTF జిల్లా ఉపాధ్యక్షుడు గొట్టె నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో TPTF సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో నాగరాజు,తదితర పట్టభద్రులు మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రైవేటు టీచర్లను ఎన్నికల బరిలో దించాలని నిర్ణయించామని అన్నారు. గత ఆరు నెలలుగా ప్రైవేటు టీచర్లు జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎన్ని విధాలుగా విన్నవించుకున్నా ప్రభుత్వం తమ గురించి ఆలోచించే స్థితిలో లేదని వారన్నారు.
అందుకే తమ ఓటు తామే వేసుకుని తమ అభ్యర్థిని తామే గెలిపించుకుందాం అనే నినాదంతో హుజూర్ నగర్ నియోజకవర్గ TPTF కమిటీ తీర్మానం చేసింది అన్నారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షబ్బీర్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు భయ్యా శివరాజ్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ , జిల్లా అధ్యక్షుడు వీరబొయిన వెంకట యాదవ్,విచ్చేయగా
ఉపాధ్యాయులు నల్లబోలు భూపాల్ రెడ్డి, యడవెల్లి సురేందర్ రెడ్డి,మామిడి కుమార్ , పింగళి నర్సిరెడ్డి, ఇందిరాల శ్రీనివాస్, జక్కుల మల్లికార్జున్, బానోత్ రమేష్, తిరుపతయ్య పయ్యావుల ప్రకాష్, కోళ్లపూడి రవి,
వెంకటేశ్వర్లు, సతీష్, నాగ వెంకటేశ్వర్లు, తిరుపతయ్య, అశోక్ , నరేందర్ రెడ్డి, మనోహర్, ప్రమీల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.