ఆదిలాబాద్ జిల్లాలోని ట్రాక్టర్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జి.ఎస్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ట్రాక్టర్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్యవర్గం అధ్యక్ష, కార్యదర్శుల తో పాటు కార్యవర్గ సభ్యులను అతిధులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని యూనియన్లు పటిష్టం చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి బోజా రెడ్డి, జైనథ్ ఎంపీపీ గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, టిఆర్ఎస్ జైనథ్ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సుగ్గెం విట్ఠల్ పలువురు ట్రాక్టర్ ఓనర్స్ డ్రైవర్ పాల్గొన్నారు.