24.7 C
Hyderabad
March 29, 2024 07: 01 AM
Slider నల్గొండ

ఢిల్లీ రైతులకు మద్దతుగా అన్ని జిల్లాల్లో ట్రాక్టర్ ర్యాలీలు

#Tammineni

దేశ రాజధాని ఢిల్లీలోరైతు లు జరిపే ఆందోళనలు, పోరాటాలకు మద్దతు గా ఈనెల 26 న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ట్రాక్టర్ ల ర్యాలీ నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా డివైయప్ఐ, యస్ఎప్ఐ ల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల బహుమతి ప్రధానోత్సవ సభకు  ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

 వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీసే కేంద్ర చట్టాలను రద్దు చేయాలని కోరుతూ జరిపే ట్రాక్టర్ ల ర్యాలీలకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. దేశ సంపదను అంబానీ, అధానీలకు కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికే బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్సు లు తెచ్చిందని అన్నారు.

మెట్టమెదలు కొత్త చట్టాలను రద్దు చేయాలని ఆందోళన లు చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట మార్చి,ధాన్యం కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. ఈ విషయం లో ప్రభుత్వం, కేసీఆర్ పునరాలోచన చేయాలని లేకపోతే రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ రైతు సంఘాల పోరాటాలను, ఉద్యమాలను నీరుగార్చే చర్యలు మానుకోవాలని కోరారు. నిరుద్యోగ సమస్యను పాలకులు పెడచెవిన పెట్టారని, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని అన్నారు. సంక్రాంతి క్రీడలలో గెలుపొందిన యువతీయువకులకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా వెలిమినేడు, చిట్యాల, చిన్న కాపర్తి గ్రామాలలోని ఇరవై కుటుంబాల వారు తమ్మినేని వీరభద్రం, సీతారాములు సమక్షంలో సిపిఎం ప్రజా సంఘాల లో చేరారు. వారిలో చిన్న బిక్షం, కొనేటి యాదయ్య,ఈసం రాజు, కొనేటి రాములు, గురుజ శ్రీను, నకిరేకంటి రాజు, రొండి మారయ్య, వీరమల్ల శంకరయ్య తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, జిల్లా నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, యస్ఎప్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, రాష్ట్ర నాయకులు బొడ్డు పల్లి వెంకట్, వివిధ ప్రజా సంఘాల నాయకులు నాతి కిరణ్, దేశబోయిన స్వరూప, జిట్ట సరోజ, అరూరి శీను, శంభయ్య, నెలికంటి నర్సింహ, నరేష్, అరూరి నర్సింహ, బొంతల సాయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ వరద ప్రాంతాలలో అరుణ పర్యటన

Satyam NEWS

పైకి అభయం లోన భయం కరోనా పై వైసీపీ నేతల తీరు

Satyam NEWS

ముత్యాలమ్మకు పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS

Leave a Comment