27.7 C
Hyderabad
April 26, 2024 04: 42 AM
Slider అనంతపురం

క‌రోనాతో పోరాడి ఓడిన సర్కిల్ ఇన్ స్పెక్టర్

#Gooti CI

క‌రోనా బారిన ప‌డిన అనంత‌పురం జిల్లా సీఐ రాజ‌శేఖ‌ర్ మృతి చెందారు. న‌గ‌రంలో ట్రాఫిక్ విధులు నిర్వ‌హిస్తున్న ఆయ‌న ఇటీవ‌ల కొవిడ్ బారిన ప‌డ్డారు. న‌గ‌ర శివారులోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ సెంట‌ర్‌లో చికిత్స పొందుతూ ఈ రోజు ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న గుత్తి ప‌ట్ట‌ణంలో ఎస్ఐగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

అనంత‌రం పోలీసు శాఖ‌లోని వివిధ విభాగాల్లో స‌మ‌ర్థ‌వంతంగా సేవ‌లు అందించారు. సీఐ రాజ‌శేఖ‌ర్ మృతి ప‌ట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. పోలీసు శాఖలో తన సమకాలీకుడు అని, ఎంతో సమర్థవంతమైన అధికారి అని గుర్తు చేసుకున్నారు. ఆయ‌న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.

Related posts

ఎష్యూరెన్స్: ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

Satyam NEWS

ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Bhavani

కంటిన్యూస్: జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ ఆంక్షలు

Satyam NEWS

Leave a Comment