దాదాపు…35 ఫైన్లు కట్టకుండా పట్టుబడ్డ ద్విచక్ర వాహన చోదకులు…!
ఇదీ విజయనగరంలో రోడ్లపై అందునా బైక్ లపై కుర్రాళ్ల పరిస్థితి. పోలీసులు అపితే…ఎందుకు ఆపారంటారు..? ఓ వందో రెండు వందలోచేతిలో పెడితే వదిలేస్తార్రా ..? అదేరా ట్రాఫిక్ పోలీసుల పని అని కుర్రాళ్లు,యువకులు…వ్యాఖ్యలు. సీన్ కట్ చేస్తే…నగరం నడిబొడ్డున అదీ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద…రయ్..రయ్ మంటూ ఇద్దరు కుర్రాళ్లు బైక్ ఆపి తనిఖీ చేస్తే..బండి ఆపిన ట్రాఫిక్ ఏఎస్ఐ విజయ…ఒక్కసారి షాక్ తిన్నాడు.
దాదాపు 35 పెండింగ్ ఫైన్లు ఉండటం చూసి..ఖంగుతిని..ఆ పక్కనే ఫైన్లు వేస్తున్నతమ పై ఉన్నతాధికారి ఎస్ఐ భాస్కర రావుకు చెప్పారు. అప్పటికే…ఆ ఇద్దరు కుర్రాళ్లు..ఈ బైక్ మాది కాదని…మందల కోసం వచ్చామని…ఈ బైక్ మా స్నేహితుడు అని చెప్పకొచ్చారు.
పోనీ లైసెన్స్ ఉందాఅని అడిగారు…హెల్మెట్ లేదు..అందునా ర్యాష్ డ్రైవింగ్. .అంటూ పోనీ ఫైన్లు ఏమైనా ఉన్నాయా అంటూ అడిగేసరికి బిక్కమొహం వేసారు. తీరా ఈ చలానా లో బండి నెంబర్ ను చెక్ చేస్తే…35 ఫైన్ లు ఉన్నాయి. వెంటనే ఎస్ఐ భాస్కరరావు…ఆ బైక్ ను స్టేషన్ లోపెట్టమని…తన సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.
వాస్తవానికి కనీసం అయిదు కన్న ఎక్కవ ఫైన్లు ఉంటే.. ఏ ఒక్కటైనా కట్టేస్తే…అక్కడిక్కడే వదిలేస్తారు. కానీ…ఈ బైక్ ముప్పైకి మించి పెండింగ్ ఫైన్ లు ఉండటం అందునా బైక్ ఆ ఇద్దరు కుర్రాళ్లదీ కాకపోవడంతో అసలు బండి ఎవ్వరిదో వాళ్ల వచ్చే వరకు బండి ఇవ్వడం కుదరదని చెప్పారు. ఏదైనా…విజయనగరం ట్రాఫిక్ పోలీసులు…డీఎస్పీ ఆదేశాలతో బాగానే పని చేస్తున్నారంటోంది…సత్యం న్యూస్.నెట్