38.2 C
Hyderabad
April 25, 2024 14: 50 PM
Slider విజయనగరం

పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించే తొలి మెట్టు ట్రాఫిక్ పోలీసులే

#VijayangaramTraffic

శాఖ పరంగా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ట్రాఫిక్ సిబ్బంది తీసుకుంటున్న చేపడుతున్న చర్యలే ఫస్ట్ అపియరన్స్ అని జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు.

రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా కేంద్రం పరేడ్ గ్రౌండ్ లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు-పోలీసుల విధానాలపై జరిగిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు.

ఈ మేరకు 11 లక్షలు విలువ చేసే ట్రాఫిక్ నియంత్రణ పరికరాలను ఎస్పీ…సిబ్బందికి అందజేసారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు.

జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణలు చేపట్టేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో 11 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ట్రాఫిక్ నియంత్రణ పరికరాలను వివిధ పోలీసు స్టేషన్లకు  ఎస్పీ రాజకుమారి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఓఎస్డీ  ఎన్.సూర్యచంద్ర రావు, అదనపు ఎస్పీ  పి.సత్యనారాయణ రావు, డీఎస్పీలు ఎల్.మోహనరావు, పి.అనిల్ కుమార్, ఎల్.శేషాద్రి మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఆయిల్ పామ్ సాగుపై రైతులతో అధికారుల ముచ్చట

Bhavani

తిరుపతి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహా సరస్వతి యాగం

Satyam NEWS

వయెావృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే….

Satyam NEWS

Leave a Comment