శాఖ పరంగా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ట్రాఫిక్ సిబ్బంది తీసుకుంటున్న చేపడుతున్న చర్యలే ఫస్ట్ అపియరన్స్ అని జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు.
రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా కేంద్రం పరేడ్ గ్రౌండ్ లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు-పోలీసుల విధానాలపై జరిగిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు.
ఈ మేరకు 11 లక్షలు విలువ చేసే ట్రాఫిక్ నియంత్రణ పరికరాలను ఎస్పీ…సిబ్బందికి అందజేసారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు.
జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణలు చేపట్టేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో 11 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ట్రాఫిక్ నియంత్రణ పరికరాలను వివిధ పోలీసు స్టేషన్లకు ఎస్పీ రాజకుమారి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ఎన్.సూర్యచంద్ర రావు, అదనపు ఎస్పీ పి.సత్యనారాయణ రావు, డీఎస్పీలు ఎల్.మోహనరావు, పి.అనిల్ కుమార్, ఎల్.శేషాద్రి మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.