ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటిలో విషాదం చోటు చేసుకున్నది. ఆయన మామ ఈ సి గంగిరెడ్డి మరణించారు.
కడప జిల్లా పులివెందులకు చెందిన ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మృతి చెందారు. ఈ సి గంగిరెడ్డి కి నివాళి అర్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల కి వచ్చే అవకాశం ఉంది.