37.2 C
Hyderabad
April 19, 2024 12: 31 PM
Slider సినిమా

మహేష్ బాబు అభిమానుల గుండెను పిండేస్తున్న ఘటన

#krishnafans

తెలుగు ఇండస్ట్రీలో  సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు  అభిమానులు గుండెను పిండే ఘటన మరెవరికీ  రాకూడదని ఘట్టమనేని మహేష్ బాబు అభిమాన సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు బాబా ప్రిన్స్ అన్నారు. రమేష్ బాబు శనివారం అకాల మరణం అందరికి తెలిసిందే.

ఆదివారం అంత్యక్రియలు కూడా ముగిశాయి. ఆ సమయంలో  ప్రిన్స్ మహేష్ బాబు ఐసోలేషన్ లో వున్నారు. తన సోదరుడిని దగ్గరికి వచ్చి చుసుకొలేని పరిస్థితి మహేష్ బాబు కు వచ్చింది.దీనితో  మహేష్ బాబు హృదయం  ఎంత కుమిలి పోయింటదో అని మహేష్ బాబు  అభిమాన సంఘం అధ్యక్షుడు బాబా ప్రిన్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

నా సర్వం నువ్వే,విశ్రాంతి తీసుకో అని అంటూ తన సోదరుని మరణం పై ట్వీట్ ద్వారా మహేష్ బాబు తెలియజేయడంతో  అభిమానులు మరింత  దుఖానికి గురయ్యారని ప్రిన్స్ బాబా అన్నారు. ఈ నూతన సంవత్సరం మహేష్ బాబుకు అన్నీ బాధలే ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కొత్త ఏడాది లోనే మహేష్ బాబు కాలు ఫ్యాక్చర్ కావడం. ఇప్పుడు తన సోదరుడిని రమేష్ బాబు ను కోల్పోవడం, కోవిడ్ కారణంగా ఐసోలేషన్ లో ఉండడం,  చివరికి కడచూపు చూసుకోలేని పరిస్థితి ఏర్పడడంతో అభిమానిగా బాధను జీర్ణించుకోలేక  పోయ్యారు.

అందుకే వారు కొల్లాపూర్ లో ఆదివారం  సినిమా టాకీస్ ను  నడపలేదు. మహేష్ బాబు ఈ బాధల నుండి  త్వరగా బయటపడాలని, ఆయన ఆరోగ్యం గా త్వరగా కోలుకోవాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభిమాన సంఘం అధ్యక్షుడు  బాబా ప్రిన్స్ ఆ భగవంతుని కోరుకుంటున్నారు.

Related posts

ప్రజల దాహార్తిని తీర్చేందుకు DSR ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం

Satyam NEWS

అధికారం దుర్వినియోగం చేస్తున్న సీఐడీ అదనపు డీజీ

Satyam NEWS

పోలీసుల పెట్రోలు సాయంపై నెటిజన్ల ప్రశంసలు

Satyam NEWS

Leave a Comment