32.2 C
Hyderabad
June 4, 2023 19: 23 PM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యంశాలు

తెలంగాణాకు విద్యుత్ భవనాలు

transco

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో విద్యుత్ శాఖ భవనాలు కూడా ఉన్నాయి. ఆ భవనాలు ఇక పూర్తిగా తెలంగాణాకు సొంతం కాబోతున్నాయి. వీటిపై రెండు రాష్ట్రాలు చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విద్యుత్ శాఖ భవనాల పేరిట ఏపికి రావాల్సిన వాటా మొత్తం ₹ 933 కోట్లగా ఖరారు చేశారు.  ఈ మొత్తాన్ని డబ్బుల రూపంలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యింది. త్వరలో జరిగే రెండు రాష్ట్రాల సీఎంల భేటీలో ఈ అంశంపై చర్చించి తుది ఆమోదముద్ర వేయనున్నారు. ఇక దీంతోపాటు విద్యుత్ సరఫరా బకాయిల కింద తెలంగాణ ఇవ్వాల్సిన మొత్తం ₹ 3 వేల కోట్లుగా తేల్చారు. ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించడం కష్టమవుతుంది. అందుకు బదులుగా ఏపీకి విద్యుత్ ను సరఫరా చేస్తామని తెలంగాణా ప్రతిపాదించింది. దీనిపై కూడా రెండు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Related posts

టెలిఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర సంస్థలతో ఆడిట్ కి సిద్ధమా?

Satyam NEWS

మన సంపద – మన ఆత్మగౌరవం – మన ఎన్టీఆర్

Satyam NEWS

పెట్రోలు బంకులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!